అమరావతి : తిరుమలలో ఏప్రిల్ 14 నుంచి ఆర్జిత సేవలకు టీటీడీ అనుమతించింది. ఆర్జిత సేవలో పాల్గొనాలకునే భక్తులు విధిగా కొవిడ్ నెగిటివ్ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది.
గతేడాది మార్చి 20 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 13 వరకు ముందస్తుగా ఆర్జిత సేవా టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించనున్నట్లు వెల్లడించింది.
ఏడాదికి ఒకసారి సర్కార్ సేవలుగా విశేషపూజ, సహస్ర కళషాభిషేకం సేవలు నిర్వహించనన్నుట్లు టీటీడీ తెలిపింది. వార్షికోత్సవంగా వసంతోత్సవం నిర్వహిస్తామని స్పష్టం చేసింది.