తన సంగీతంతో కోట్లాది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఇన్నాళ్లు మ్యూజిక్తో మాయ చేసిన రెహమాన్ ఇప్పుడు నటుడిగా మారేందుకు సిద్ధమయ్యారు .మోహన్ లాల్ హీరోగా రూపొందుతున్న ‘ఆరట్టు’ అనే మలయాళ చిత్రంలో అతిథి పాత్ర చేశారు రెహమాన్. ఈ విషయాన్ని మోహన్ లాల్ తెలియజేస్తూ.. ‘‘మ్యూజిక్ మ్యాస్ట్రో రెహమాన్ తో షూట్లో పాల్గొనడం సంతోషంగా ఉంది’’ అంటూ లొకేషన్ ఫోటోను షేర్ చేశారు . ఉన్ని కృష్ణన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ద్వారా శ్రద్ధా శ్రీనాథ్ మలయాళ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. నవంబర్లో సినిమాను విడుదల చేయనున్నారు. కాగా, అంతకుముందు మోహన్లాల్ నటించిన ‘మన్యం పులి’ సినిమాకు ఉన్నికృష్ణన్ కథ అందించారు. ఈ సినిమా అన్ని భాషల్లో ఘన విజయం సాధించింది. దీంతో మళ్లీ వీరిద్దరి కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతుండం వల్ల అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.