అమరావతి,జూన్ 19: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అక్కడి సర్కారు కర్ఫ్యూ సడలింపులు ఇచ్చింది. ఈనెల 21 నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సడలిపులు ఇచ్చారు. దీంతో అన్ని రకాల కార్యకలాపాలకు సాయంత్రం 6గంటల వరకు అనుమతి ఇచ్చింది ఏపీ సర్కారు.
ఈ నేపథ్యంలో నే ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. జున్ 21నుంచి బస్సు సర్వీసులు పెంచాలని నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్సు సర్వీసులు నడపనున్నది. రాష్ట్రంలో వివిధ జిల్లాల మధ్య పగలు నడిచే దూరప్రాంత సర్వీసుల సంఖ్యను పెంచింది. అలాగే దూరప్రాంత సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది ఏపీఎస్ఆర్టీసీ. అంతేకాదు ఆదివారం నుంచి బస్సుల్లో అడ్వాన్స్డ్ టికెట్ రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం కల్పించింది.