ఢిల్లీ ,జూన్ 6: కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ 2019-20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పనితీరు గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ) 2019-20 విడుదలకు ఆమోదం తెలిపారు. పాఠశాల విద్యారంగంలో మార్పు తెచ్చేందుకుప్రభుత్వం70కొలమానాలతోపనితీరుగ్రేడింగ్ సూచికను ప్రవేశపెట్టింది. రాష్ట్రాలు ,కేంద్రపాలిత ప్రాంతాల కోసం 2017-18 సంవత్సరం ఆధారంగా పీజీఐ మొదటిసారి 2019-18లో ప్రచురించారు. పీజీఐ 2019-20 సంవత్సరానికి రాష్ట్రాలు ,కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ సిరీస్లో మూడవ ప్రచురణ. పిజిఐ కసరత్తు రాష్ట్రాలు, యుటిలను బహుముఖ జోక్యాలను చేపట్టే దిశగా ప్రేరేపిస్తుంది. అది సరైన విద్య ఫలితాలను అందిస్తుంది. పీజీఐ రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలకు అంతరాలను గుర్తించడానికి సహాయపడుతుంది. తదనుగుణంగా పాఠశాల విద్యా విధానం ప్రతి స్థాయిలో పటిష్టంగా ఉండేలా జోక్యం చేసుకోవడానికి ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తుంది. పంజాబ్, చండీగఢ్, తమిళనాడు, అండమాన్, నికోబార్ దీవులు, కేరళ 2019-20 సంవత్సరానికి అత్యధిక గ్రేడ్ (గ్రేడ్ ఎ ++) ను సాధించాయి.
అంతకుముందు సంవత్సరాలతో పోల్చితే చాలా రాష్ట్రాలు ,కేంద్రపాలిత ప్రాంతాలు పిజిఐ 2019-20లో తమ గ్రేడ్ను మెరుగుపర్చాయి. అండమాన్- నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, పుదుచ్చేరి, పంజాబ్, తమిళనాడు మొత్తం పిజిఐ స్కోర్ 10శాతం పెరిగింది. అంటే 100 అంతకన్నా ఎక్కువ పాయింట్లు సాధించాయి. అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీప్,పంజాబ్ 10శాతం (8 పాయింట్లు) లేదా అంతకంటే ఎక్కువ మెరుగుదల చూపించాయి. పదమూడు రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలుపిజిఐ పరిథి వరకు చుస్తే 10శాతం(15 పాయింట్లు) లేదా అంతకంటే ఎక్కువ మెరుగుదల చూపించాయి. అండమాన్-నికోబార్ దీవులు,ఒడిశా 20శాతం అంతకంటే ఎక్కువ అభివృద్ధిని చూపించాయి. పీజీఐ పరిథిలో ఈక్విటీలో అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, ఒడిశా 10శాతం కంటే ఎక్కువ మెరుగుదలను చూపించాయి.