ఢిల్లీ ,జూన్ 8: దివ్యాంగ విద్యార్థులకు ఈ-కంటెంట్ ద్వారా సమగ్ర విద్యను అందించడానికి రూపొందించిన మార్గదర్శకాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ మంగళవారం ఆమోద ముద్ర వేశారు.డిజిటల్, ఆన్ లైన్, దూరవిద్య విధానాల ద్వారా అందిస్తున్న విద్యా కార్యక్రమాలకు ఒక సమగ్ర రూపు ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం 2020 మే 17వ తేదీన ఈ-విద్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని లక్ష్యాల మేరకు సమర్ధంగా అమలు చేయడానికి కార్యాచరణ ప్రణాళికకు రూపకల్పన చేసి మార్గదర్శకాలను సూచించడానికి విద్యామంత్రిత్వశాఖకి చెందిన పాఠశాల విద్య, అక్షరాస్యతా విభాగం నిపుణుల బృందాన్ని నియమించింది. దీనిలో దివ్యంగ విద్యార్థులకు ప్రత్యేకంగా ఈ-కంటెంట్ ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ-కంటెంట్ ను అమలు చేసి విద్యకు సంపూర్ణ రూపాన్ని ఇవ్వడానికి తొలిసారిగా జరిగిన ప్రయత్నాలకు తుదిరూపు ఇచ్చిన నిపుణుల బృందం వీటిని అమలు చేయడానికి మార్గదర్శకాలను కూడా రూపొందించి తన నివేదికను అందించింది. ‘వికలాంగ విద్యార్థులకు ఈ-కంటెంట్ ను అభివృద్ధి చేయడానికి అనుసరించవలసిన మార్గదర్శకాలు’ పేరిట అందించిన ఈ నివేదికలో11విభాగాలు రెండు అనుబంధాలను పొందుపరిచారు. ఈ నివేదికను కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఆమోదించింది.