Srisailam EO | రోజువారీగా విధుల నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు శ్రీశైలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) ఎస్ లవన్న ప్రశంసాపత్రం అందుకోనున్నారు. దేశ 76వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా అంజాద్ భాషా.. విధుల నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు.
శ్రీశైలం దేవస్థానంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపాల్సి ఉండటంతో ఎస్ లవన్న.. నంద్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద స్వాతంత్య్ర వేడుకలకు హాజరు కాలేకపోయారు. ఫలితంగా మంత్రి అంజాద్ భాషా చేతుల మీదుగా లవన్న ప్రశంసాపత్రం అందుకోలేకపోయారు. త్వరలో నంద్యాల జిల్లా కలెక్టరేట్ నుంచి శ్రీశైలం ఈవో ఎస్ లవన్న ఈ ప్రశంసాపత్రాన్ని అందుకోనున్నారు.