ఆస్ట్రేలియా : టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడిగా కాసర్ల నాగేందర్ రెడ్డిని మూడోసారి నియమిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల నియామక పత్రాన్ని అందజేశారు. కాగా, 2016లో ఆస్ట్రేలియాలో టీఆర్ఎస్ని స్థాపించి మొదటి సారి అధ్యక్షుడిగా ఎన్నికైన నాగేందర్ రెడ్డి ..ఆస్ట్రేలియా వ్యాప్తంగా గులాబీ జెండాని ఎగరవేసి అత్యధిక సభ్యత్వ నమోదును చేయించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఖండాంతరాలలో చాటి చెప్పి పార్టీ పటిష్టతకు నిరంతరం కృషి చేశారు. ప్రతిపక్షాల విమర్శలను తనదైన శైలిలో తిప్పి కొడుతూ అటు సోషల్ మీడియాలో ఇటు తెలంగాణ లో పార్టీ నిర్వహించే కార్యక్రమాలలో భాగస్వాములవుతూ పార్టీ అధిష్ఠానం వద్ద మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
పార్టీ కోర్ కమిటీలో డా. అనిల్ రావు చీటీ, రాజేష్ గిరి రాపోలు, సాయి రామ్ ఉప్పు, రవి శంకర్ దూపాటి, రవీందర్, రవి సాయల, రాకేష్ విశ్వామిత్ర, సన్నీ గౌడ్, సతీష్, ప్రవీణ్, సునిల్, జస్వంత్ , సంగీత, విక్రమ్, పరశురామ్, నరేష్ రెడ్డితో పాటు దాదాపు 150 మందితో భారీ కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా తన పై నమ్మకం ఉంచి మళ్లీ నియమించిన కవిత, మహేష్ బిగాలకు నాగేందర్ రెడ్డి, నూతన కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపారు .