హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల లైసెన్స్లకు దరఖాస్తులు క్రమంగా పెరుగుతున్నాయి. నూతన మద్యం పాలసీ ప్రకారం డిసెంబర్ ఒకటి నుంచి 2,620 వైన్స్లకు కొత్త లైసెన్స్దారులను ఎంపిక చేయనున్నారు. ఇందుకు ఎక్సైజ్శాఖ దరఖాస్తులు స్వీకరిస్తున్నది. లైసెన్స్ దరఖాస్తుకు రూ.2 లక్షలు నాన్రీఫండబుల్ ఫీజుగా నిర్ణయించారు.
సోమవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,600 దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. సోమవారం ఒక్కరోజే 3,750 దరఖాస్తులు అందాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 1,064 దరఖాస్తులు వచ్చాయి. 2019లో వైన్స్ల లైసెన్స్లకు 49 వేల వరకు దరఖాస్తులు వ చ్చాయి. ఈ సారి ఆ సంఖ్య 50 వేలు దాటుతుందని అధికారుల అంచనా.