ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నిజామాబాద్ జిల్లా బీసీ ఐక్య వేదిక వినతి
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్లో బీసీ భవన్ నిర్మాణానికి ఎకరం స్థలం కేటాయించి, భవన నిర్మాణానికి సహకరించాలని ఆ జిల్లా బీసీ ఐక్యవేదిక ప్రతినిధులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్లో ఆమెకు వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, సలహాదారు రాజారాం యాదవ్, టెలికం బోర్డు మెంబర్ టీ సతీశ్, నాయకులు దర్శనం దేవేందర్, లక్మణ్గౌడ్, చింతా మహేశ్, లక్ష్మీ నారాయణ, శ్రీనివాస్గౌడ్, నక లింగారెడ్డియాదవ్, రామగౌడ్, ఉద్యోగ సంఘాల నాయకులు రేవంత్, నాగరాజు, వినోద్, గట్టు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.