దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పరిశోధనలు చేయాలని ఉందా? దేశంలోని యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్/లెక్చరర్గా పనిచేయాలనుకుంటున్నారా? అయితే మీరు తప్పనిసరిగా జాతీయస్థాయిలో నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)లో అర్హత సాధించాల్సిందే. జాతీయస్థాయిలో నిర్వహించే నెట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహిస్తుంది. ఏటా రెండుసార్లు నిర్వహించే ఈ పరీక్షను కొవిడ్-19తో ప్రస్తుతం ఒకేసారి నిర్వహిస్తున్నారు. సీఎస్ఐఆర్-యూజీసీ-నెట్-2021 ప్రకటన విడుదలైన నేపథ్యంలో అర్హత, స్కాలర్షిప్ తదితర వివరాలు సంక్షిప్తంగా….
సీఎస్ఐఆర్-యూజీసీ-నెట్
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)లు సంయుక్తంగా నిర్వహించే ఈ పరీక్షను ప్రస్తుతం వాటి తరఫున ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఈ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)లో అర్హత సాధించిన వారు సైన్స్ కోర్సులను డిగ్రీ, యూనివర్సిటీల్లో బోధించడానికి అర్హులు. దీంతోపాటు జేఆర్ఎఫ్కు ఎంపికైన వారు స్టయిఫండ్తో కూడిన పీహెచ్డీకి అర్హులు. ఈ ఫెలోషిప్ పొందిన వార జాతీయస్థాయిలోని ల్యాబొరేటరీలు, ఐఐటీలు, ఎన్ఐటీలు ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ ల్యాబ్లలో పీహెచ్డీ చేయడానికి అర్హులు.
జేఆర్ఎఫ్: దీనిలో అర్హత సాధించిన వారు జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్కు అర్హులు. వీరికి మొదటి రెండేండ్లు నెలకు రూ.31 వేలతోపాటు ఏడాదికి రూ.20 వేలు కంటింజెంట్ గ్రాంట్ను ఇస్తారు. ఆ తర్వాతి రెండేండ్లు నెలకు రూ.35 వేల చొప్పున ఇస్తారు.
సీఎస్ఐఆర్- నెట్- ఐదు సబ్జెక్టులు
కెమికల్ సైన్సెస్
ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్, ప్లానిటరీ సైన్సెస్
లైఫ్ సైన్సెస్
మ్యాథమెటికల్ సైన్సెస్
ఫిజికల్ సైన్సెస్
ఎవరు రాయవచ్చు?
ఎమ్మెస్సీ లేదా ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ లేదా బీఈ/బీటెక్ లేదా నాలుగేండ్ల బీఎస్సీ/బీఫార్మసీ తదితర తత్సమాన కోర్సుల్లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. పీజీ/నాలుగేండ్లు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోట్: పీజీ/నాలుగేండ్ల డిగ్రీలో జనరల్, ఓబీసీలకు కనీసం 55 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీలకు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి.
వయోపరిమితి
జేఆర్ఎఫ్కు గరిష్ఠ వయోపరిమితి 2020, జూలై 1నాటికి జనరల్ అభ్యర్థులు 28 ఏండ్లు మించరాదు. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జండర్, పీహెచ్సీ, మహిళలకు ఐదేండ్లు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
నోట్: బీఈ, బీఎస్, బీఫార్మసీ వంటి కోర్సులు చేసినవారు కేవలం జేఆర్ఎఫ్కు మాత్రమే అర్హులు. లెక్చరర్షిప్కు అర్హులు కారు.
పరీక్ష విధానం
పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. కాలవ్యవధి మూడు గంటలు. మూడు సెక్షన్లు ఉంటాయి.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: 2022, జనవరి 2
పరీక్ష తేదీలు: 2022, జనవరి 29, ఫిబ్రవరి 5, 6
రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ, వరంగల్
వెబ్సైట్: https://csirnet.nta.nic.in