దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఒక రోగికి ఏక కాలంలో కిడ్నీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. అపోలో ఆస్పత్రిలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆస్పత్రి చీఫ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ మనీష్ వర్మ, డా॥ రవి అండ్రూస్, డా॥ నవీన్ పోలవరపు వివరాలను వెల్లడించారు. టాంజానియా దేశానికి చెందిన గాబ్రియేల్ సీజర్ సిసా(57) అనే రోగి మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతూ రెం డేళ్ల క్రితం అపోలో ఆస్పత్రికి వచ్చాడు. అప్పటికే కాలేయ సమస్యలున్నట్లు తేలింది. దాంతో రెండు వ్యాధులను నయం చేయాలంటే కిడ్నీ మార్పిడీ చేయడంతో పాటు కాలేయాన్ని మార్చాల్సి ఉంటుందని నిర్ణయించారు. అయితే, ఏక కాలంలో కిడ్నీ, కాలేయం దాత లు దొరకడం కష్టమని, దొరికినా అత్యంత సంక్లిష్టమైన సర్జరీ చే యాల్సి ఉంటుందని వైద్యులు వివరించారు.
దాంతో సీజర్ సిసా మేనల్లుడు కిడ్నీని దానం చేయడానికి ముందుకు వచ్చాడు. దాం తో పాటు అతడి భార్య కాలేయం దానం చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో అరుదైన ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేయడానికి అపోలో ఆస్పత్రిలో రంగం సిద్ధం చేశారు. ఫిబ్రవరి 12న 23 గంటల పాటు శస్త్ర చికిత్స నిర్వహించి కిడ్నీని, కాలేయాన్ని అమర్చారు. అప్పటి నుంచి ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో ఉన్న రోగి సీజర్ సిసా పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. అతడితో పాటు అతడికి అవయవాలు దానం చేసిన దాతలు కూడా పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కార్యక్రమంలో డాక్టర్లు శశిధర్రెడ్డి, రాజశ్రీ, మంజునాథ్. నవకాంత్ పాల్గొన్నారు.