హైదరాబాద్, మే 3: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అపర్ణ గ్రూప్ తమ ఉద్యోగులతోపాటు తమ ఫ్రంట్ లైన్ కార్మికుల కోసం వ్యాక్సినేషన్ డ్రైవ్నుప్రారంభించినట్లు వెల్లడించింది. తమ బ్రాండ్లు అయిన అపర్ణ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్లిమిటెడ్ వ్యాప్తంగా ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగనున్నదని తెలిపింది. ఈ డ్రైవ్కు అపర్ణ గ్రూప్ స్పాన్సర్చేస్తుంది. దీనిద్వారా అపర్ణ గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తోన్నపదివేలమంది ఫ్రంట్లైన్ కార్మికులకు వ్యాక్సిన్లను అందించనున్నారు. ఇప్పటివరకూ 360 మంది ఉద్యోగులు వ్యాక్సిన్ తీసుకున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని , ఉద్యోగుల భద్రత కోసం కంపెనీ పలు చర్యలను తీసుకుందని సంస్థ ప్రకటించింది.
సమాజ సంక్షేమం, అభివృద్ధి ఫలాలు నిరుపేదలకు సైతం చేరువకావాలనే లక్ష్యంతో అపర్ణ గ్రూప్ ప్రయత్నిస్తుంటుంది. ఈ లక్ష్యంతోనే కంపెనీ పలు సమాజ హిత కార్యక్రమాలను అపర్ణ నోవెల్ సొసైటీ ఫర్ వెల్ఫేర్ అండ్ రీసెర్చ్ (ఆన్సర్) ద్వారా చేపట్టింది. ఆన్సర్ ప్రధానంగా గృహ, నీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్య సేవలు, ఉపాధి, విద్య విభాగాలలో పనిచేస్తుంది. మహమ్మారి వచ్చిన కొత్తలోనే ప్రధానమంత్రిసహాయనిధితో పాటుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధులకు విరాళాలను అందించిన సంస్థలలో ఒకటిగా అపర్ణ గ్రూప్ నిలిచింది. కోవిడ్ సంక్షేమ కార్యక్రమాల కోసం 5 కోట్ల రూపాయలను విరాళంగా అందించింది.