అమరావతి: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు టిటిడి ఛైర్మెన్ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి సాదరంగా అహ్వానించగా… అర్చక బృందం ”ఇస్తికఫాల్” ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
అనంతరం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తరువాత రంగనాయకుల మండపంలో బిశ్వ భూషణ్ హరిచందన్ కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్, ఈవోలు ఆయనకు తీర్థప్రసాదాలు అందించారు.