అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు ఇవాళ ఇంద్రకీలాద్రిలో అమ్మ వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు, ఈవో భ్రమరాంబ స్పీకర్ దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం స్పీకర్ ప్రత్యేక పూజలు చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో చేసిన ప్రత్యేక ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసిం చారు. అధికారులు భక్తులకు కల్పిస్తున్న ప్రాధాన్యతను కొనియాడారు.
మూడేండ్ల ఏపీ సీఎం జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో పరుగులు తీస్తుందని, వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు బాగా వృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు.