గుంటూరు:
ఏపీ నుండి తెలంగాణ ఆసుపత్రులకు వెళ్లాలంటే అక్కడి ఆసుపత్రుల అనుమతి తప్పనిసరిగా ఉండాలని రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నవారిని సరిహద్దుల వద్ద ఆపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ప్రజలకు స్పష్టత ఇచ్చేందుకు ఎస్పీ ఈ ప్రకటన విడుదల చేశారు. కరోనా మహమ్మరి వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణా రాష్ట్రం కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నదని ఆయన అన్నారు.
అనారోగ్య సమస్యలతో ప్రైవేట్ అంబులెన్సులలో తెలంగాణా వెళ్లేవారికి తెలంగాణా ఆస్పత్రి యాజమాన్యం ముందస్తు అంగీకారపత్రాన్ని తప్పనిసరిగా కలిగివుండాలని తెలిపారు. అలాంటి పత్రాలు లేనిపక్షంలో అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద నిలిపివేస్తారని స్పష్టం చేశారు.