తిరుమల, జూన్ 23: ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు బుధవారం తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అదనపు కార్యనిర్వహణ అధికారి ఎవి ధర్మ రెడ్డి ఘనంగా ఆహ్వానం పలికారు. వేద పండితులు ఆశీర్వదించి , శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.