అమరావతి, జూలై :ముస్లింలకు రేపు బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్ర రవాణా,సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) శుభాకాంక్షలు తెలిపారు. ‘త్యాగం, సహనం, ఐక్యమత్యానికి ప్రతీక బక్రీద్’ అని ఆయన అన్నారు.
ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు ఎల్లప్పు డూ లభించాలని మంత్రి పేర్ని నాని ఆకాంక్షించారు. భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ గొప్పతన మని, కుల, మతాలకతీతంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. కాగా కోవిడ్ కారణంగా ఈ ఏడాది ఇండ్ల లోనే పండుగను నిరాడంబరంగా జరుపుకోవాలని ముస్లింలకు మంత్రి పేర్ని నాని సూచించారు.