అమరావతి: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా శుక్రవారం విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అదనపు షోలు వేయకూడదని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు అమ్మాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. బెనిఫిట్షోలు వేస్తే చర్యలు తీసుకుంటామని థియేటర్ల యాజమాన్యాలను హెచ్చరించింది.
జీవో 35 ప్రకారమే అమలు చేయాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు అమ్మాలని సూచించింది. ఈమేరకు కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరులో థియేటర్లకు తహశీల్దార్ నోటీసులు ఇచ్చారు. థియేటర్ల యజమానులతో పోలీసులు, రవెన్యూ అధికారులు సమావేశమయ్యారు. బెనిఫిట్షోలు, అధనపు షోలు వేయొద్దని స్పష్టం చేశారు.