ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ బెయిల్ను రద్దు చేయాలంటూ చిత్తూరు కోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం తరపున ఏజీ సుధాకర్ రెడ్డి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. పదో తరగతి ప్రశ్నాపత్రం పేపర్ లీకేజీ వ్యవహారంలో నారాయణ కుట్ర ఉందని, ఆయన బెయిల్ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
ఇక ప్రభుత్వం దాఖలు చేసిన ఈ పిటిషన్పై చిత్తూరు కోర్టు విచారణ చేపట్టింది. ఏజీ సుధాకర్ రెడ్డి చేసిన వాదనలతో పూర్తిగా ఏకీభవించింది. నారాయణకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నెల 24 న కేసుపై వాదనలు జరగనున్నాయి.