అమరావతి : ప్రభుత్వ ఆదేశాలను దిక్కరించినందుకు ఏపీ ప్రభుత్వం ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించింది . పీఆర్సీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలన్నీ పీఆర్సీ సాధన సమితిగా వారం రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాము కూడా ఆందోళనల్లో ఉన్నందున పనులు చేయబోమని, తమ ఒత్తిళ్లు తీసుకురావద్దని పే అండ్ అకౌంట్స్, ట్రెజరీ శాఖలకు చెందిన ఉద్యోగులు కరాఖండిగా ప్రభుత్వానికి తేల్చి చెప్పారు.
అయితే కొత్త పీఆర్సీ ప్రకారం ఒకటో తేదీ లోగా జీతాలు వేసేందుకు తప్పనిసరిగా హాజరు కావాలని లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని పే అండ్ అకౌంట్స్, ట్రెజరీ శాఖలకు చెందిన ఉద్యోగులను ప్రభుత్వం హెచ్చరించింది. దీంట్లో భాగంగా కొత్త పీఆర్సీ జీవోల ప్రకారం బిల్లులు జమ చేయని అధికారులకు సోమవారం ఛార్జ్ మెమోలు జారీ చేసింది. ముగ్గురు డీడీలు, 21 మంది సబ్ ట్రెజరీ అధికారులు, ఇద్దరు ఏటీఓలకుమొత్తం 27 మందికి ఛార్జ్ మెమో జారీ చేసింది.