అమరావతి: మరోసారి ఏపీ ఉద్యోగులు సమరానికి సిద్ధమయ్యారు. ఈ సారి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేయాలన్న డిమాండ్తో ఏపీ ఉద్యోగులు జంగ్ సైరన్ ఊదారు. సీపీఎస్ను రద్దు చేయాలంటూ లక్షలాది ఉత్తరాలతో ఉద్యమం చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం సిద్ధమైంది. గురువారం నుంచి 13వ తేదీ వరకు 10 రోజుల పాటు లక్ష మంది సీపీఎస్ ఉద్యోగులు సీఎం జగన్కు లేఖలు రాయనున్నారు.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) రద్దు కోరుతూ ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఉద్యమ కార్యాచరణ మొదలెట్టింది. ఇవాల్టి నుంచి 10 రోజుల పాటు సీపీఎస్ ఉద్యోగులు దాదాపు లక్ష మంది సీఎం జగన్కు లేఖలు రాయాలని ఏపీ సీపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అప్పలరాజు, కే పార్థసారథి పిలుపునిచ్చారు. ఇటీవల రాజస్థాన్లో సీపీఎస్ను రద్దు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర సీఎం అధికారికంగా ప్రకటించడంతో పాటు ఏపీలో ఆ మేరకు ఉద్యమ కార్యాచరణ చేపట్టారు.
ఈ నేపథ్యంలో సీఎం జగన్ కూడా ఎన్నికల సమయంలో తానిచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ లేఖలతో ఆవేదనను తెలపాలని నిర్ణయించారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీనే కాకుండా సీపీఎస్ రద్దుపై ఎన్నికల మేనిఫోస్టోలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా వినతిపత్రాలు ఇవ్వనున్నారు. సీపీఎ్సను రద్దు కోరుతూ సీఎంకు నివేదించేలా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల లెటర్ ప్యాడ్లపై లేఖలు తీసుకోవాలని నిర్ణయించారు.