అమరావతి : ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 864 కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం హెల్త్ బులిటెన్లో తెలిపింది. వైరస్ నుంచి 1,310 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తాజాగా వైరస్ ప్రభావంతో 12 మంది మృత్యువాతపడ్డారు. కొత్త కేసులతో కలిపి మొత్తం కేసులు 20,30,849కు పెరిగాయి. ఇందులో 20,02,187 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి 14,010 మంది కోలుకున్నారు. కొత్త కేసుల్లో నెల్లూరులో 141, తూర్పు గోదావరిలో 135, వైఎస్సార్ కడపలో 117, ప్రకాశంలో 114, చిత్తూరులో 101 మంది వైరస్కు పాజిటివ్గా పరీక్ష చేశారు. వైరస్తో చిత్తూరులో నలుగురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఒక్కరు, పశ్చిమ గోదావరిలో ఒకరు మృత్యువాతపడ్డారు.