అమరావతి : విశాఖ ఎయిర్పోర్టు దగ్గర ట్రాఫిక్ ఆంక్షలపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న విశాఖలోని శ్రీశారదపీఠంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. విశాఖ పట్నం ఎయిర్పోర్టు నుంచి శారదపీఠం వరకు సీఎం వెళ్లే మార్గాల వద్ద గంటల తరబడి పోలీసులు ఆంక్షలు విధించడంతో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
గంటల తరబడి ట్రాఫిక్ ఆంక్షలపై జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. తన పర్యటన సందర్భంగా ప్రజలకు కలిగిన ఇబ్బందులపై చింతిస్తున్నానని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని పోలీసులను ఆదేశించారు. విశాఖ సంఘటనపై విచారణ జరపాలని డీజీపీని ఆదేశించారు.