హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసానికి ఏపీ సీఐడీ అధికారులు ఈ ఉదయం వచ్చారు. రాజధాని భూముల అక్రమాలపై చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్లోని ఆయన నివాసానికి సీఐడీ అధికారులు వచ్చారు. 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చామని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు. విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. సీఐడీ నోటీసులు ఇవ్వడంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.