అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి హాట్ హాట్గా మొదలు కానున్నాయి. అమరావతిలోని అసెంబ్లీ హాల్లో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ బడ్జెట్ ప్రసంగంతో సమావేశాలను ప్రారంభించనున్నారు. అధికార వైసీపీ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారిన మూడు రాజధానుల వ్యవహారం, సీఆర్డీ చట్టం రద్దుపై ఇటీవల ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు అనంతరం ఈ సమావేశాలు జరుగనున్నాయి.
రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ చట్టం రద్దు చట్ట పరిధిలోకి రాదని, వీటిపై చట్టాలు చేసే హక్కు శాసనసభకు లేదని తీర్పునివ్వడం నివ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు. చట్టాలు తయారు చేసే శాసనసభ వ్యవస్థకు అధికారాలు లేవనడంపై అధికార పార్టీకి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నారు. కాగా హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిందని, ఈ తీర్పును శిరసావహించి అమలు చేయాల్సిందేనని ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు గట్టిగా పట్టుబట్టనున్నారు. అమరావతి రాజధాని అని ప్రకటన చేయాలని డిమాండ్ చేయనున్నారు .
దీంతో పాటు వివేకానందరెడ్డి, పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన రాష్ట్ర ఐటీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డికి అసెంబ్లీ నివాళి అర్పించనున్నారు. రేపు గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశంలో బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయం పై నిర్ణయం తీసుకోనున్నారు.