అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు టీడీపీ ఆందోళనలతో మొదలయ్యాయి. ఇవాళ ఉదయం స్పీకర్ అధ్యక్షతన ప్రారంభైనా సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. నిరుద్యోగ సమస్యపై వాయిదా తీర్మానంపై చర్చించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ జాబ్లెన్ క్యాలెండర్ అయిందని టీడీపీ సభ్యులు ఆరోపించారు. స్పీకర్ పోడియం వద్దకు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు.
జాబ్ ఎక్కడ జగన్ ప్రశ్నోత్తరాలను అడ్డుకోవడం సరైంది కాదని, టీడీపీ సభ్యులు సభా సాంప్రదాయాలు పాటించడం లేదని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి అన్నారు. కరోనా టైమ్లో ప్రశ్నోత్తరాలు పెట్టమని గొడవ చేసిన టీడీపీ ఇప్పుడు వద్దంటోందని మంత్రి బుగ్గన అన్నారు. దమ్ముంటే అసెంబ్లీ పెట్టండి అని సవాల్ చేసిన టీడీపీ ఇప్పుడు సభను అడ్డుకుంటుందని అన్నారు.