టాలీవుడ్లో అగ్రహీరోలందరి సరసన నటించి వన్ ఆఫ్ లీడింగ్ హీరోయిన్గా మారింది బెంగళూరు భామ అనుష్కా (Anushka Shetty) శెట్టింది. మాధవన్, అంజలితో కలిసి నటించిన నిశ్శబ్దం (Silence) సినిమా తర్వాత మళ్లీ ఏ సినిమాలో కనిపించలేదు అనుష్క. చాలా కాలం తర్వాత నేడు మహిళా దినోత్సవాన్ని (women’s day) పురస్కరించుకుని ఓ స్పెషల్ ఫొటోను షేర్ చేసింది.
తండ్రి, సోదరుడు, స్నేహితుడు, భర్త, భాగస్వామి..మీరు ప్రత్యేకంగా భావించే, మీకు మద్దతుగా నిలిచే వాళ్లు వారి సొంత, పెద్ద మార్గాల్లో ప్రేమిస్తారు. మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వృత్తిపరంగా, శారీరకంగా, మానసికంగా , ఆత్మీయంగా..బయట ఉన్న వాటి వెనుక పరుగులు పెట్టడం మానేయండి..జీవితం దుర్భరంగా ఉంటుంది. మీతో ఉన్న వ్యక్తిని ఆదరించండి. అంటూ సందేశాన్ని పోస్ట్ చేసింది అనుష్క.
స్వీటీ టాలీవుడ్ యువ హీరో నవీన్ పొలిశెట్టితో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో నవీన్ పొలిశెట్టి 20 ఏండ్ల యువకుడిగా కనిపించనుండగా..అనుష్క 40 ఏండ్ల మహిళ పాత్ర కనిపించబోతుందట. యూవీ క్రియేషన్ ప్రొడక్షన్ బ్యానర్పై తెరకెక్కనున్న ఈ మూవీని మహేశ్ డైరెక్ట్ చేయబోతున్నాడు.