సూపర్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ఎంట్రీ ఇచ్చి..ఆ తర్వాత దక్షిణాదిన వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా మారిపోయింది బెంగళూరు భామ అనుష్కా శెట్టి (Anushka Shetty). ఈ బ్యూటీ చివరిసారిగా ఓటీటీ ప్లాట్ఫాంలో నిశబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. అరుంధతి, భాగమతి లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీని సంపాదించుకుంది అనుష్క. ఈ భామకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి ఇపుడు సినీ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.
అనుష్క దగ్గరకి రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ ప్రాజెక్టుల్లో నటించే ఆఫర్ రాగా…అంతగా ఆసక్తిగా లేకపోవడంతో తిరస్కరించిందట. ఇప్పటివరకు అనుష్క ఖాతాలో ఒకే సినిమా ఉంది. అది కూడా యూవీ క్రియేషన్స్ బ్యానర్ (UV Creations)లో జాతిరత్నాలు హీరో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty)తో కలిసి సినిమా చేస్తోంది. అయితే అనుష్క ఓ స్టేట్ మెంట్ ఇచ్చిందని టాక్ నడుస్తోంది. ఇంతకీ ఆ విషయమేంటంటే తాను కేవలం యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో సినిమాలు చేస్తానని, ఇతర నిర్మాతలతో పనిచేయడానికి రెడీగా లేనని చెప్పినట్టు ఇన్సైడ్ టాక్.
దీనిక్కారణం యూవీ క్రియేషన్స్ సంస్థ తన అభిరుచికి అనుగుణంగా సినిమాలు చేస్తుందని, తనను ఓ హీరోలా ట్రీట్ చేస్తుందని చెప్పుకొచ్చింది స్వీటీ. అనుష్క రాబోయే కాలంలో చేసే సినిమాల విషయంలో చాలా క్లారిటీతో ఉన్నట్టు తాజా అప్ డేట్తో తెలిసిపోతుంది.