కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన కథాంశాల్ని ఎంచుకుంటూ అందం, అభినయం కలబోసిన పాత్రల్లో రాణిస్తోంది మలయాళీ సోయగం అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ‘18పేజెస్’ చిత్రంలో నిఖిల్ సరసన కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సుందరి మరోసారి నిఖిల్తో జోడీకట్టబోతున్నది. వివరాల్లోకి వెళితే… నిఖిల్ కథానాయకుడిగా ‘కార్తికేయ-2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చందు మొండేటి దర్శకుడు. అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ నిర్మాతలు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ను కథానాయికగా ఖరారు చేశారు. ఉత్కంఠను పంచే మిస్టరీ థ్రిల్లర్గా సీక్వెల్ను తెరకెక్కించబోతున్నారు. అనుపమ పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుందని తెలిసింది. ఈ నెల 26 నుంచి షూటింగ్ మొదలుకానుంది.