ముంబై: బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోదీకి అభిమానిగా పేరొందిన సీనియర్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మరోసారి మాట మార్చారు. సర్కారు ఇమేజీ పెంచుకోవడం కన్నా ప్రజల ప్రాణాలు కాపాడడం ముఖ్యం అంటూ కోవిడ్ సంక్షోభం విషయంలో మోదీ టీమ్కు చురకలు వేసి అందరినీ ఆశ్చర్యపరచిన ఖేర్ ఇప్పుడు నష్టనివారణ చర్యలు మొలుపెట్టారు. పనిచేసేవారే తప్పులు చేస్తారంటూ కొత్తపాట ఎత్తుకున్నారు. గల్తీ ఉనీసే హోతీహై.. జో కామ్ కర్తే హై.. నికమ్మోకి జిందగీతో.. దూసరోంకీ బురాయీ ఖోజ్నేమే హీ ఖత్మ్ హో జాతీహై అని ట్విట్టర్ లో సర్కారు అనుకూల ట్వీట్ పెట్టి చేతులు దులిపేసుకున్నారు. పని చేసేవారే తప్పులు చేస్తారు.. అల్పుల జీవితం ఇతరుల తప్పులను వెదకడంలోనే అంతమైపోతుంది అని ఆ కవితా పాదాల అర్థం. ఎక్కడో వారివల్ల పొరపాటు జరిగిపోయింది.. ఇమేజ్ పెంచుకోవడం కన్నా జీవితంలో చాలా ఉందని వారు అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది అని వ్యాఖ్యానించారు. ప్రజలు ప్రభుత్వంపై కోప్పడడం సబబే. ప్రభుత్వం దిద్దుబాటు చేసుకోవడమూ మామూలే అని పేర్కొన్నారు. అనుపమ్ భార్య కిరణ్ ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నారు.