చండూర్, అక్టోబర్ 22: దళితులపై దాడులు చేస్తూ దళితులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీని మునుగోడులో ఓడించి గుణపాఠం చెప్పాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా చండూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దళిత మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. స్వాతం త్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా మనువాదం పేరుతో దళితులపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు అండగా ఉంటున్నదన్నారు.
దళితుబంధు ద్వారా దళితులను ఆర్థికంగా ఆదుకొంటున్న కేసీఆర్ గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మరో ఐదేండ్లలో రాష్ట్రంలోని దళితులందరికీ న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉన్నదని తెలిపారు. దళితుల గురిం చి ఆలోచిస్తున్న టీఆర్ఎస్కు టీఎమ్మార్పీఎస్ మద్దతునిస్తున్నదన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు మాదిగలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య తదితరులు పాల్గొన్నారు.