హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధికి మరో రూ. 17 కోట్ల 50 లక్షలు విడుదల చేసినందుకుగాను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు జర్నలిస్టుల తరుపున రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ. 100 కోట్ల కార్పస్ ఫండ్లో భాగంగా ఇప్పటికే రూ. 34 కోట్ల 50 లక్షలు మంజూరు కాగా, తాజాగా గురువారం రూ. 17 కోట్ల 50 లక్షలు జమ అయ్యాయని, దీంతో సంక్షేమ నిధి రూ. 52 కోట్లకు చేరిందని తెలిపారు. ఈ సంక్షేమ నిధితో జర్నలిస్టులకు మరింతగా ఉపయోగపడే విధంగా సంక్షేమ కార్యక్రమాలను రూపొందించడానికి అవకాశం ఉందని అకాడమీ చైర్మన్ అభిప్రాయపడ్డారు. జర్నలిస్టుల వెంట ఉండి, సంక్షేమ నిధికి నిధులు విడుదలయ్యేలా కృషి చేసిన ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.