Shivsena Crisis | మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమిని వ్యతిరేకించడానికి, ఏక్నాథ్ షిండేకు ఎందుకు మద్దతు ఇస్తున్నామో శివసేన ఎమ్మెల్యే చిమన్రావు పాటిల్ బయట పెట్టారు. ఈ మేరకు ఆయన మాట్లాడినట్లు చెబుతున్న వీడియోను ఏక్నాథ్ షిండే తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
30 ఏండ్లుగా కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని చిమన్రావు పాటిల్ చెప్పారు. తమ నియోజకవర్గాల్లో ఆ రెండు పార్టీలే ప్రధాన పోటీదారులని, వచ్చే ఎన్నికల్లోనూ వారే ప్రత్యర్థులుగా ఉంటారని చిమన్రావు పటేల్ చెప్పారు. పొత్తులు సహజంగా ఉండాలని విన్నవించుకున్నా సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పందించలేదన్నారు.
అందువల్లే తమ నాయకుడు ఏక్నాథ్ షిండేను గట్టి వైఖరి తీసుకోవాలని కోరామన్నారు. సహజ కూటమి ఏర్పాటు కావాలని శివసేన కార్యకర్తల కోరిక అని అన్నారు. అందుకే భావ జాలం కోసం జరుగుతున్న తిరుగుబాటుకు మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు, 10 మంది స్వతంత్య్ర ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారన్నారు.