చేపల పెంపకమూ కొనసాగింపు
బడ్జెట్లో నిధుల కేటాయింపు
ఆశావహంగా బడ్జెట్ ప్రతిపాదనలు
కరోనా తర్వాత మెరుగైన అర్థికం
మార్చి మధ్యలో బడ్జెట్ సమావేశాలు
బడ్జెట్ ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్
అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గొర్రెల పంపిణీ కార్యక్రమం విజయవంతమైనందున మరో మూడు లక్షల యూనిట్ల పంపిణీకి రానున్న బడ్జెట్లో ప్రతిపాదనలు పొందుపరచనున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. అదేవిధంగా చేపల పెంపకం కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తామని స్పష్టంచేశారు. త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఆశాజనకంగా ఉండబోతున్నదని సూచనప్రాయంగా తెలి పారు. బడ్జెట్ ప్రతిపాదనలపై శనివారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శాఖలు అందించిన ఆర్థిక నివేదికలు, బడ్జెట్లో పొందుపరచాల్సిన శాఖలవారీ అంచనాలను సమీక్షించారు. అనంతరం మాట్లాడు తూ.. రాష్ట్రంలో పలు సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుతోపాటు గొర్రెల పెంపకం కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తామని తెలిపారు. ఈ పథకం ద్వారా యాదవులు, గొల్ల కుర్మల కుటుంబాలు ఆదాయాన్ని ఆర్జిస్తున్నందున ఇప్పటికే పంపిణీచేసిన 3.70 లక్షల యూనిట్లకు కొనసాగింపుగా మరో మూడు లక్షల గొర్రెల యూనిట్లను పంపిణీచేసేందుకు వచ్చే బడ్జెట్లో ప్రతిపాదనలు చేస్తామన్నారు. గొ ర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించడమే కాకుండా, దేశంలోనే అత్యధిక షీప్ పాప్యులేషన్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ పురోగమిస్తున్నదని గుర్తించినందున ఈ పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా చేపల పెంపకం కూడా యథాతథంగా ఉంటుందని తెలిపారు.
ఖజానాకు రూ.50 వేల కోట్ల నష్టం
కరోనా ప్రభావం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.50 వేల కోట్లమేర నష్టం వాటిల్లినట్లు సీఎం పేర్కొన్నారు. దీని ప్రభావం రూ.లక్ష కోట్లకు చేరుకున్నదని చెప్పారు. కరోనా అనంతరం రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొన్నాయని, వివిధ రూపాల్లో ఆదాయం పెరిగిందని తెలిపారు. గత బడ్జెట్ కంటే వచ్చే బడ్జెట్ కేటాయింపులు ఎక్కువగా ఉండే ఆస్కారమున్నదని వివరించారు. ఉన్నతస్థాయి సమావేశంలో బడ్జెట్ అంచనాలు, కేటాయింపులకో సం విధివిధానాలు ఖరారయ్యాయని, రేపటినుంచి ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, ము న్సిపల్ పరిపాలన, విద్య, నీటిపారుదల తదితర శాఖలను వరుసగా పిలిచి ఆర్థికశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సమావేశాలు నిర్వహిస్తారని సీఎం చెప్పారు. బడ్జెట్పై కసరత్తు తర్వాత తుదిదశలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బడ్జెట్కు తుదిరూపం ఇస్తారు. బడ్జెట్ సమావేశాలు మార్చినెల మధ్యలో ప్రారంభమయ్యే అవకాశముందని సీఎం చెప్పారు. సమావేశం లో మంత్రి హరీశ్రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగరావు, ఆర్థికశాఖ సలహాదారు జీఆర్ రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి రోనాల్డ్ రాస్, సీఎంవో అధికారులు భూపాల్రెడ్డి, స్మితాసబర్వాల్ పాల్గొన్నారు.
గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. అంతేకాక దేశంలోనే ఎక్కువ గొర్రెలున్న రాష్ట్రంగా తెలంగాణ పురోగమిస్తున్నదని గుర్తించింది. కాబట్టి ఈ పథకాన్ని కొనసాగిస్తాం. చేపల పెంపకం కూడా కొనసాగుతుంది.
సీఎం కేసీఆర్