తిరుమల, జూన్, 20: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 16 టీటీడీ కళ్యాణమండపాలు నిర్మిస్తున్నామని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు. ఏడుకొండల్లోని అంజనాద్రి కొండలే హనుమ జన్మస్థలం అని మనం నమ్ముతున్నాము. ఆంజనేయుడు జన్మస్థలం పై ఎలాంటి వివాదాలు వద్దు. రెండేళ్ల పాటు మా పాలకమండలి సేవలు అందించింది. ఈ సేవ చేసే అవకాశం ఇచ్చిన సీఎం జగన్ కి మనస్ఫూర్తిగా టిటిడి పాలకమండలి ధన్యవాదాలు తెలియజేస్తున్నదని టీటీడీ ఛైర్మన్ అన్నారు. తిరుపతిలోని గరుడ వారధిని ఆలిపిరి వరకూ విస్తరిస్తామని.. కరోన ప్రభావం తగ్గిన నేపథ్యంలో తిరుమలకు అనుమతించే భక్తుల సంఖ్యను పెంచుతామని సుబ్బారెడ్డి తెలిపారు.