నల్లగొండ : దళితబంధు పథకం అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ.. ఎస్సీ కులస్తులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్రావు, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ పాల్గొన్నారు. అంతకు ముందు భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్సీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళితబంధు పథకం అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు వారు కృతజ్ఞతలు తెలిపారు.