సిద్దిపేట అర్బన్ : ఇంటర్మీడియెట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం సిద్దిపేటలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నందుకు ఇంటర్ విద్య జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం సీఎం కేసీఆర్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఫ్లెక్సీకి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జేఏసీ నాయకులు క్షీరాభిషేకం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మూల్యాంకానికి అనేక వ్యయ ప్రయాసలతో హైదరాబాద్ వెళ్లాల్సివచ్చిందని పేర్కొన్నారు. సమస్యను గత సంవత్సరం మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించి ఉన్నతాధికారులతో చర్చించి సిద్దిపేటలో మూల్యాంకన కేంద్రం ఏర్పాటుకు కృషి చేశారన్నారు.
అనంతరం అధ్యాపకులు స్వీట్లు పంచుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డి, జీజెఎల్ఏ నాయకులు సుధాకర్రెడ్డి, కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం నాయకులు కనకచంద్రం, ప్రిన్సిపాల్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, కిషన్, జీజేఎల్ఏ జిల్లా అధ్యక్షుడు చెన్నూరి శ్రీనివాస్, నాయకులు శ్రీనివాస్రెడ్డి , నాగేందర్, రవి, వెంకటరమణ పాల్గొన్నారు.