శ్రీనగర్: ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూన్ 28 నుంచి ప్రారంభంకానుంది. 56 రోజుల పాటు జరిగే యాత్రకు సంబంధించిన షెడ్యూల్ను అమర్నాథ్ ఆలయ ట్రస్ట్ శనివారం విడుదల చేసింది. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన రాజ్భవన్లో జరిగిన 40వ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భక్తులందరూ కరోనా మార్గదర్శకాలు పాటించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవనుంది. గతేడాది కరోనా మహమ్మారి కారణంగా యాత్రకు కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు.