చర్లపల్లి, మే 14: పేదల ఆకలి తీర్చేందుకు అన్నపూర్ణ భోజన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఏఎస్రావునగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డలో జీహెచ్ఎంసీ, హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోజన కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ పట్టణ ప్రాజెక్ట్ అధికారిణి ఇందిర, నాయకులు సోమశేఖర్రెడ్డి, ఏస్ఏ రహీం, నాను, ఉప్పల్ నియోజకవర్గ మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు తాడూరి గగన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పేదలు, వలస కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు. డివిజన్ పరిధిలోని చర్లపల్లి బస్టాప్ వద్ద జీహెచ్ఎంసీ, హరేరామ హరేకృష్ణ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ భోజన కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభుగౌడ్, రాజుగౌడ్, భానుచందర్, శ్రీకాంత్యాదవ్, పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉప్పల్, మే 14: ఉప్పల్లోని గాంధీ విగ్రహం ప్రాంతంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అన్నపూర్ణ రూ.5ల భోజన కేంద్రాన్ని ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ మందుముళ్ల రజితాపరమేశ్వర్రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్రెడ్డి, నేతలు కిశోర్, అనిల్కుమార్, మురళీకృష్ణారెడ్డి, రామకృష్ణ, భాస్కర్, చంద్రశేఖర్రెడ్డి, జిత్తురెడ్డి, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.