తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆలయంలో 8 నుంచి 10 వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు కొనసాగుతాయి. ఈ ఉత్సవాలకు సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం, పవిత్ర అధివశం నిర్వహించారు. ఆలయంలో సంవత్సరం పొడవునా పలు క్రతువుల్లో తెలియక జరిగిన దోషాల నివారణకు ప్రతి ఏటా మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
పవిత్రోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 8 న పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 9న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 10న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ.750/- చెల్లించి ఒకరోజు ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీర బ్రహ్మం ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం, ఏఈఓ ప్రభాకర్రెడ్డి, అగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, అర్చకులు బాబుస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ దామోదరం తదితరులు పాల్గొన్నారు.