హైదరాబాద్, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ): కేంద్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, వైఫల్యాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఎత్తి చూపుతున్నందున.. ఆయన బిడ్డ, ఎమ్మెల్సీ కవితపై నిరాధారమైన వార్తలు సృష్టించడాన్ని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తీవ్రంగా ఖండించారు. మరోవైపు హైదరాబాద్లోని కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడికి యత్నించడం హేయమైనదన్నారు.
దీనిని పిరికిపంద చర్యగా మంత్రి పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ మొత్తం కవితకు అండగా ఉండి, బీజేపీ కార్యకర్తలను తరిమి కొడతామని హెచ్చరించారు. కేంద్రప్రభుత్వం దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చట్టపరమైన ప్రక్రియను అనుసరించి విచారణ చేపట్టాలే కానీ.. ఇలా నిరాధారంగా, చిల్లరచేష్టలతో కవిత వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కల్గించడానికి బీజేపీ నేతలు యత్నించడం నీతిమాలిన చర్య అని ప్రశాంత్రెడ్డి అన్నారు.
ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడితే తెలంగాణ ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని యన హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను కానీ ఆయన కుటుంబాన్ని కానీ ఇలా లీకుల పేరుతో నిరాధారమైన కేసుల పేరుతో వేధించాలని చూస్తే తెలంగాణ సమాజం ఊరుకోబోదని అని మంత్రి వేముల తేల్చిచెప్పారు. తగిన బుద్ధి చెప్తుందని అన్నారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసం ముట్టడికి బీజేపీ కార్యకర్తలు విఫలయత్నం చేయగా.. టీఆర్ఎస్ శ్రేణు లు అడ్డుకుని, తరిమికొట్టాయి. బం జారాహిల్స్ రోడ్ నం.14 లోని ఎమ్మె ల్సీ కవిత ఇంటి ముట్టడికి బీజేపీ కార్యకర్తలు సోమవారం ప్రయత్నించారు. ఇంటిపై దాడికి పాల్పడి విధ్వం సం సృష్టించాలన్న ప్లాన్తో వచ్చిన వారు కర్రలు, రాడ్లు వెంట తెచ్చుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రెచ్చిపోయిన బీజేపీ కార్యకర్తలు పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతోపాటు తోపులాటకు దిగారు.
పలువురు పోలీసులను గాయపర్చారు. ఈ విషయమై సమాచారం అందుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు అప్పటికే అక్కడికి పెద్దసంఖ్యలో చేరుకున్నారు. వారిపైనా బీజేపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగేందుకు ప్రయత్నించగా, ఆగ్రహించిన టీఆర్ఎస్ కార్యకర్తలు వారిని తరమికొట్టారు. స్థానికులు, టీఆర్ఎస్ శ్రేణులు వెంటపడి తరమడంతో బీజేపీ కార్యకర్తలు అక్కడినుంచి పరారయ్యారు.