అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ప్రధానికి మోడీకి లేఖ రాశారు. రాష్ట్రానికి ఆక్సిజన్ కేటాయింపు పెంచాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి అందుతున్న 590 టన్నుల ఆక్సిజన్ సరిపోవడం లేదని పేర్కొన్నారు. అదనంగా మరో 300 టన్నులకుపైగా కేటాయించాలని కోరారు.
ఆక్సిజన్ కొరత కారణంగా రాష్ట్రంలో కొవిడ్ బాధితుల చికిత్సలో ఇబ్బంది తలెత్తే ప్రమాదముందని తెలిపారు. వెంటనే ఆక్సిజన్ కోటా పెంచాలని ప్రధానిని సీఎం జగన్ అభ్యర్థించారు. ఆక్సిజన్ కొరత కారణంగా సోమవారం తిరుపతి రుయా దవాఖానలో 11 మంది కొవిడ్ బాధితులు మృతి చెందిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.