అమరావతి: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్లీన్స్వీప్ దిశగా వైఎస్ఆర్సీపీ దూసుకుపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ ఫ్యాన్ హవా కొనసాగుతోంది. విశాఖ కార్పొరేషన్ను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. కార్పొరేషన్లో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 57 డివిజన్లలో వైఎస్ఆర్సీపీ గెలుచుకొని ఆధిక్యంలో ఉంది. రాష్ట్రంలోని మొత్తం 75 మున్సిపాలిటీల్లో ఇప్పటికే 69 కైవసం చేసుకున్నది. గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లలోనూ ఫ్యాన్ జోరు కొనసాగింది. కేవలం రెండు మున్సిపాలిటీల్లో టీడీపీ విజయం సాధించింది.