అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా అల్లవరంలో కరోనా ఉధృతి అధికంగా ఉన్న దృష్ట్యా ఈనెలాఖరు వరకు కర్ఫ్యూ విధిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఇక్కడ దుకాణాలు, వ్యాపార సముదాయాలు తెరిచేందుకు అనుమతినిచ్చింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించింది. ఆంక్షలను ఎవరూ అతిక్రమించిన కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. ఆంధ్రప్రదేశ్లో రాత్రి కర్ఫ్యూను ఈ నెల 26 వరకు పొడిగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.