అమరావతి : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ బెయిల్ రద్దు కేసు విచారణ జూన్ 1కి వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు నాంపల్లి సీబీఐ కోర్టును జగన్, సీబీఐ అధికారులు మరోసారి గడువు కోరడంతో విచారణను మరోసారి వాయిదా వేసింది. అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
పిటిషన్పై బుధవారం సీబీఐ కోర్టు విచారణ జరిపింది. లాక్డౌన్ కారణంగా కౌంటర్ దాఖలు చేయలేకపోయామని జగన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలుకు గడువు ఇవ్వాలని అభ్యర్థించారు. ఇరువర్గాల వాదనలను విన్న కోర్టు కౌంటర్ దాఖలు చేసేందుకు జగన్కు చివరి అవకాశం ఇచ్చింది. జూన్ 1న కౌంటర్ దాఖలు చేయకపోతే నేరుగా విచారణ చేస్తామని పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.