అమరావతి: మార్చి 3న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరుగుతుందని ఏపీ చీఫ్ సెక్రటరీ కార్యాలయ అధికారులు తెలిపారు. ఏపీ సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఉదయం 11 గంటలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుందన్నారు. కేబినెట్ సమావేశంలో ప్రతిపాదించే అంశాలతో కూడిన జాబితాను అన్ని ప్రభుత్వ శాఖలూ మార్చి 2 మధ్యాహ్నం ఒంటి గంటలోపుగా కార్యాలయానికి పంపాలని సీఎస్ కార్యాలయం వెల్లడించింది.