అందాల ముద్దుగుమ్మ అనసూయ క్రేజ్ రోజురోజుకు పెరుగుతూ పోతుంది. యాంకర్గాను, నటిగాను అలరిస్తూనే అడపాదడపా స్పెషల్ సాంగ్స్తో దుమ్ము రేపుతుంది. రీసెంట్గా చావు కబురు చల్లగా సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్లో నర్తించిన అనసూయ అభిమానుల మనసులని గెలుచుకుంది. సినిమా కన్నా అనసూయ డ్యాన్స్కు మంచి మార్కులు పడ్డాయి.
ప్రస్తుతం ఆర్ఎక్స్ 10 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మహా సముద్రంలోను ఓ స్పెషల్ సాంగ్ చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా పాయల్ రాజ్పుత్ని అనుకున్నప్పటికీ, ఇప్పుడు ఆమె స్థానంలో అనసూయ వచ్చి చేరిందని అంటున్నారు. శర్వానంద్ , సిద్ధార్ద్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న మహా సముద్రం చిత్రం పక్కా ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందట. సుంకర రామబ్రహ్మం ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మహాసముద్రం చిత్రం తెరకెక్కనుంది.