Ananya Pandey Digital Entry | ఈ మధ్య కాలంలో సినీ తారలు కేవలం వెండితెరకే పరిమితం అవ్వాలని అనుకోవట్లేదు. ఛాన్స్ వస్తే వెబ్ సిరీస్లలో కూడా నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే కాజల్, తమన్నా, కైరా వంటి పలువురు స్టార్ హీరోయిన్లు డిజిటల్లోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నారు. ఇక వీళ్ళ బాటలోనే బాలీవుడ్ హీరోయిన్ అనన్యపాండే ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైంది. ఇటీవలే లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ బ్యూటీ. అయితే ఈ సినిమా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అంతేకాకుండా ఈ సినిమాలో అనన్య నటనకు ప్రేక్షకుల నుండి తీవ్ర విమర్షలు వచ్చాయి. దాంతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకోవాలన్న అనన్య కల.. కలగానే మిగిలిపోయింది.
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2’ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్ బ్యానర్పై కరణ్ జోహార్ నిర్మించాడు. కాగా అనన్యను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన కరణ్.. ఇప్పుడు ఓటీటీలోకి లాంచ్ చేస్తున్నాడు. ‘కాల్ మి బీ’ పేరుతో అనన్యపాండేతో ఓ వెబ్ సిరీస్ను నిర్మిస్తున్నాడు. అమెజాన్లో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్లో పలువురు బాలీవుడ్ స్టార్ యాక్టర్లు కీలక పాత్రల్లో నటించనున్నట్లు సమాచారం. ఈ వెబ్ సిరీస్ను ‘పీకే’, ‘సంజు’ వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన కొలిన్ డి కున్హా దర్శకత్వం వహించనున్నాడు. ఈయన గతేడాది జాన్వీకపూర్తో ‘దోస్తానా-2’ చిత్రానికి తెరకెక్కించాలి, కానీ ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఇప్పుడు ఈ వెబ్ సిరీస్తో దర్శకుడిగా లాంచ్ అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ వెబ్ సిరీస్ ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుంది.
Read Also:
777 Charlie | ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘777చార్లీ’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శింబుకు కాస్ట్లీ కారు గిఫ్ట్గా ఇచ్చిన ‘వెందు తానింధాతు కాడు’ నిర్మాత.. ధర ఎంతో తెలుసా?
Jawan Movie | భారీ ధరకు షారుఖ్ ఖాన్ ‘జవాన్’ నాన్-థియేట్రికల్ హక్కులు.. వామ్మో అన్ని కోట్లా
Khaidi-2 Movie | ‘ఖైదీ-2’ మొదలయ్యేది అప్పుడేనా.. క్లారిటీ ఇచ్చిన కార్తి..!