అమరావతి, జూన్ 1:ప్రభుత్వం నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య మందుకు అనుమతి లభించడంతో అందరికీ మందు పంపిణీ చేసేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వనమూలికలు, ముడిపదార్థాల సేకరణలో ఇప్పటికే ఆనందయ్య బృందం నిమగ్నమైంది. ఇప్పటికే కృష్ణపట్నం పంచాయతీ పరిధిలో 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. ఔషధం తయారీకి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించడంతో మందు పంపిణీపై ప్రకటన చేసే వరకు ఎవరూ గ్రామంలోకి రావొద్దని ఆనందయ్య స్పష్టం చేశారు.