నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 1: కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. సోమవారం శ్రీశైలం జలాశయానికి 1,04,961 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 196.11 టీఎంసీలు నిల్వ ఉన్నది. జూరాల రిజర్వాయర్కు 49,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 48,177 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతున్నది.
ఎస్సారెస్పీ ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో తగ్గడంతో వరదగేట్లను మూసివేశారు. ప్రస్తుతం 21,635 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగుల(90.313 టీఎంసీలు)కు 1087.70 అడుగుల (75.465 టీఎంసీలు) ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీబరాజ్లో 4,02,520 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నది. గేట్లన్నీ ఎత్తి అంతే మొత్తంలో అవుట్ఫ్లోగా నీటిని దిగువకు వదులుతున్నారు.